![]() కర్ణాటకలో 97 శాతం స్కూళ్లలో వేర్వేరుగా టాయిలెట్లు హైదరాబాద్: మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు.. 78,450. అందులో బాలురు, బాలికలకు వేర్వేరుగా టాయిలెట్లు ఉన్న స్కూళ్లు కేవలం 37,997. అంటే కేవలం 48 శాతం! కర్ణాటకలో ప్రభుత్వ పాఠశాలలు.. 50,257. అందులో బాలబాలికలకు వేర్వేరుగా టాయిలెట్ సదుపాయం ఉన్నవి 49,185. అంటే 97 శాతం!! డిపెప్, సర్వశిక్షా అభియాన్, విద్యాహక్కు చట్టం.. ఇలా అనేక పథకాల పేరుతో ఏటా వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా మన రాష్ట్రంలోని సర్కారీ బడుల్లో మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయో చెప్పడానికి ఈ చిన్న ఉదాహరణ చాలు. పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల పర్యవేక్షణ లేమితో ఏటా నాలుగైదు కోట్లు కుమ్మరిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. టాయిలెట్లే కాదు.. అనేక స్కూళ్లలో తాగునీటి సౌకర్యం కూడా లేదు. రాష్ట్రంలో 78,450 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే.. అందులో 22,026 స్కూళ్లలో (28.08 శాతం) బాలబాలికలకు ఉమ్మడి టాయిలెట్లు ఉన్నాయని, కేవలం 37,997 (48.43 శాతం) స్కూళ్లలోనే వారికి వేర్వేరుగా టాయిలెట్ సదుపాయం ఉందని స్వయంగా విద్యాశాఖ పేర్కొంది. ఈ మేరకు రూపొందించిన గణాంకాలను తాజాగా కేంద్ర ప్రభుత్వానికి అందించింది. ఉన్న టాయిలెట్లలో కూడా చాలా వరకు దెబ్బతిన్నాయి. |
Latest Current Affairs
Latest Job Alerts
Career Guidance
Wednesday, 16 October 2013
సర్కారీ స్కూళ్లలో టాయిలెట్లు లేక బాలికల ఇక్కట్లు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment