![]() ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఏడాదికే ఈజిప్టు మరోసారి సంక్షోభంలో మునిగిపోయింది. సుమారు రెండున్నర సంవత్సరాల క్రితం ముబారక్ పాలనకు చరమగీతం పాడి ప్రజాస్వామ్యపథంలోకి అడుగుపెట్టిన ఈజిప్ట్ మళ్లీ సంక్షోభంలోకి జారిపోయింది. 2012 జూన్ లో జరిగిన ఎన్నికల్లో గెలిచి ప్రజాస్వామ్యబద్ధంగా అధ్యక్షుడిగా ఎన్నికై పదవీ బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ మోర్సీ పదవి ఏడాదిన్నరలోనే ముగిసింది. అయనను జులై 3న సైన్యం పదవీచ్యుతుడ్ని చేసింది. ముస్లిం బ్రదర్ హుడ్ ప్రభుత్వాన్ని కూలదోసి, దేశ రాజ్యాంగాన్ని రద్దు చేసి ఈజిప్టు ప్రధాన న్యాయమూర్తి అడ్లీ మన్సూర్ ను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు. ఈ పరిణామాలను మోర్సీ మద్దతుదార్లు సైనిక తిరుగుబాటుగా అభివర్ణిస్తే, సైన్యం మద్దతుదార్లు, మోర్సీ వ్యతిరేకులు మాత్రం విప్లవంగా ప్రకటించారు. |
Latest Current Affairs
Latest Job Alerts
Career Guidance
Wednesday, 23 October 2013
ఈజిప్టు సంక్షోభం - సైన్యం తిరుగుబాటు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment