ప్రపంచంలో 20 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలకు చెందిన ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్లకు సంబంధించిన గ్రూపును జీ-20గా వ్యవహరిస్తారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో వివిధ అంశాలకు సంబంధించి ఆయా దేశాల సహకారం, చర్చల కొనసాగింపునకు వీలుగా జీ-20 గ్రూపు ఏర్పాటును కెనడా మాజీ ప్రధానమంత్రి పాల్మార్టిన్ ప్రతిపాదించారు. జీ-20ని 1999 సెప్టెంబర్లో ప్రకటించగా.. మొదటి సమావేశం అదే ఏడాది డిసెంబర్లో జరిగింది. తాజాగా జీ-20 దేశాల నేతలు సెప్టెంబర్ 5, 6 తేదీల్లో రష్యాలోని సెయింట్ పీటర్సబర్గలో సమావేశమయ్యారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే దిశగా సభ్య దేశాలు కలిసి పని చేయాలని సమావేశంలో నిర్ణయించారు. General Essay- G-20 Summit decisions and analysis
No comments:
Post a Comment