2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం సంభవించనున్నట్లు 2005లోనే అభిప్రాయం వ్యక్తం చేయడం ద్వారా రఘురాం రాజన్ ప్రపంచం దృష్టిని ఆకర్షించగలిగారు. అలాంటి ముందుచూపున్న రఘురాం రాజన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్గా నిమితులయ్యారు. ఆయన భారత్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభం నుంచి గట్టెక్కించగలరని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, అయినా ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని రాజన్ అభిప్రాయపడ్డారు.
No comments:
Post a Comment