రెండున్నరేళ్ల నుంచి నాలుగున్నరేళ్ల వయసు పిల్లల్లో ఏదైనా నేర్చుకోవాలన్న కుతూహలం, ఆసక్తి మెండుగా ఉంటాయి. ఉత్సాహం ఉరకలేస్తూ.. గంతులేస్తూ సందడి చేసే వయసది. ఇలాంటి చిచ్చరపిడుగుల్ని ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో.. పూర్వ ప్రాథమిక స్థాయిలో నిష్ణాతులైన టీచర్ల అవసరం ఎంతో ఉంది. చిన్నారులు స్కూల్ అంటే ఇష్టం పెంచుకునేలా.. చదువు పట్ల వారిలో ఆసక్తి కలిగేలా చేయడంలో పూర్వ ప్రాథమిక స్థాయి టీచర్ల పాత్ర గణనీయం. అలాంటి నిష్ణాతులైన టీచర్లను అందించడానికి ఏర్పడిన కోర్సే.. పీజీ డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్..
No comments:
Post a Comment